హైడ్రా చట్టబద్ధత కల్పిస్తూ గెజిట్ విడుదల

-

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో చెరువులు, కుంటలు, ప్రభుత్వ స్థలాలు, నాలాలు, పార్కులు కబ్జా చేసి నిర్మించిన అక్రమ కట్టడాలను హైడ్రా అధికారులు కూల్చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే వందల ఇండ్లను, కట్టడాలను నేలమట్టం చేశారు. అయితే ఈ కూల్చివేతలపై కొన్ని చోట్ల తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. కొందరు బాధితులు కోర్టులను ఆశ్రయిస్తుండగా.. న్యాయస్థానాలు సైతం చట్టబద్ధతపై ప్రశ్నిస్తున్నాయి. ఈ నేపథ్యంలో హైడ్రాకు హై పవర్ వచ్చింది. హైడ్రాకు విస్తృతాధికారాలు కల్పిస్తూ రేవంత్ ప్రభుత్వం ఓ ఆర్డినెన్స్ ని తీసుకొచ్చింది.

తాజాగా హైడ్రా చేపట్టబోయే అన్ని కూల్చివేతలు, కార్యకలాపాలకు చట్టబద్ధత లభించింది. హైడ్రా కోసం ప్రభుత్వం ప్రత్యేక ఆర్డినెన్స్ తీసుకురాగా.. దానిపై గవర్నర్ జిష్ణుదేవ్ శర్మ సంతకం చేశారు. దీంతో హైడ్రాకి చట్టబద్దత లభించినట్టు అయింది. ఆ హైడ్రా చట్టబద్దతకు గవర్నర్ జిష్ణుదేవ్ శర్మ ఆమోదం తెలిపారు. హైడ్రా చట్టబద్దత కల్పిస్తూ గెజిట్ విడుదల చేసింది తెలంగాణ ప్రభుత్వం.  ఆర్డీనెన్స్ కు గవర్నర్ ఆమోదం తెలపడంతో ప్రభుత్వం గెజిట్ రిలీజ్ చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news