ఇవాళ ఢిల్లీ వెళ్లనున్న రేవంత్‌ రెడ్డి, చంద్రబాబు

-

ఇవాళ ఢిల్లీ వెళ్లనున్నారు రేవంత్‌ రెడ్డి, చంద్రబాబు. రేపు కేంద్ర మంత్రి అమిత్ షా అధ్యక్షతన మావోయిస్ట్ ప్రభావిత రాష్ట్రాల సీఎంలతో జరిగే సమావేశంలో పాల్గొననున్నారు సీఎం చంద్రబాబు. చత్తీస్ ఘడ్ లో భారీ ఎన్ కౌంటర్ నేపథ్యంలో మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతాల సీఎంల సమావేశానికి ప్రాధాన్యత సంతరించుకుంది.


2026 నాటికి వామపక్ష తీవ్రవాదం ఆనవాళ్లు ఉంకూడదనే టార్గెట్టుగా పని చేస్తోంది కేంద్రం. మావోయిస్టుల ఏరివేత, మావోయిస్టుల ప్రభావిత ప్రాంతాల్లో చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించనుంది కేంద్రం. రోడ్ కనెక్టివిటీ, ఫోన్ కనెక్టివిటీ పెంచేలా చర్యలు తీసుకోనుంది కేంద్రం. ఏపీలో మావోయిస్టుల ప్రభావిత ప్రాంతాల అభివృద్ధి, కావాల్సిన నిధులపై కేంద్రానికి నివేదిక ఇవ్వనున్నారు చంద్రబాబు. కేంద్ర మంత్రితో సమావేశం అనంతరం అందుబాటులో ఉన్న ఢిల్లీ పెద్దలను సీఎం చంద్రబాబు కలిసే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం. అటు వరద సాయం కోరేందకు రేవంత్ రెడ్డి కూడా ఢిల్లీకి వెళ్లనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news