పాపం చిన్నారి.. 5 నెలల బేబీని బస్టాండ్‌లో వదిలెళ్లిన మహిళ

-

ఏపీలోని సత్యసాయి జిల్లా కదిరిలో అమానవీయ ఘటన ఒకటి వెలుగుచూసింది. ఐదు నెలల చిన్నారని ఏపీఎస్ ఆర్టీసీ బస్టాండ్‌లో గుర్తుతెలియని ఓ మహిళ వదిలేసి వెళ్లిపోయింది. బాత్ రూమ్‌కు వెళ్లి వస్తానని, బ‌స్టాండ్ ప్రాంగణములో ఉన్న బీటెక్ విద్యార్థినికి పాపను అప్పగించిన మహిళ మళ్లీ తిరిగిరాలేదు.ఎంతకీ సదరు మహిళ రాకపోవడంతో ఆ బీటెక్ స్టూడెంట్ పోలీసులకు సమాచారం అందించింది.

దీంతో పోలీసులు చిన్నారని స్వాధీనం చేసుకుని ఐసీడీఎస్ అధికారులకు అప్పగించారు.అయితే, ఆ మహిళ బస్టాండ్ ప్రాంగణంలో తిరిగిన విజువల్స్ సీసీ ఫుటేజ్‌లో రికార్డయ్యాయి.కదిరి టౌన్ పోలీసులు చుట్టపక్కల ప్రాంతాల్లో మహిళను గురించి విచారించగా ఆచూకీ తెలియరాలేదు. దీంతో సదరు మహిళపై పోలీసులు సుమోటో కేసు నమోదు చేశారు.ఎవరికైనా సమాచారం తెలిస్తే తమకు చెప్పాలని కదిరి టౌన్ సీఐ నారాయణ రెడ్డి తెలిపారు. అందుకోసం 94407 96851కు ఫోన్ చేయాలని సూచించారు.

 

Read more RELATED
Recommended to you

Latest news