కడపలో ల్యాండ్‌ కొన్న పవన్ కళ్యాణ్‌ !

-

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ కడపలో ల్యాండ్‌ కొనుగోలు చేశారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చొరవతో మైసూర వారి పల్లెకు మహర్దశ పట్టింది. డిప్యూటీ సీఎం సొంత నిధులతో పాఠశాలకు ప్లే గ్రౌండ్ దానం చేశారు. తన సొంత ఖర్చులతో 60 లక్షలు ఖర్చు చేసి 97 సెంట్లు స్థలాన్ని కొనుగోలు చేసి పంచాయితీ కార్యాలయానికి దానం చేశారు.

pawan kalyan, kadapa

డిప్యూటీ సీఎం గా బాధ్యతలు చేపట్టిన తర్వాత రెండు నెలల క్రితం మొట్టమొదటిసారిగా రైల్వే కోడూరు మండలం మైసూర వారి పల్లెలో పర్యటించిన డిప్యూటీ సీఎం…అన్నమయ్య జిల్లా పర్యటనలో ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నారు. రైల్వే కోడూరు మండలం మైసూరా వారి పల్లెలో హెల్త్ సెంటర్ కు 10 సెంట్లు దానం ఇచ్చారు రైతు. ఇక ఈ తరునంలోనే… దానిని హెల్త్ సెంటర్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు అధికారులు. తాను ఇచ్చిన హామీలను ఎప్పటికప్పుడు అన్నమయ్య జిల్లా అధికారులతో సమీక్షిస్తూ వచ్చిన పవన్ కళ్యాణ్… హామీల అమలకు కృషిచేసిన జిల్లా కలెక్టర్ శ్రీధర్ తో పాటు జిల్లా అధికార యంత్రాంగాన్ని అభినందించారు.

Read more RELATED
Recommended to you

Latest news