ఊటీలో స్థలం కొన్న మెగాస్టార్.. ధర ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

-

మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. అంచలంచెలుగా ఎదిగి మెగాస్టార్ అయ్యారు. ప్రస్తుతం చిరంజీవికి కోట్లాది ఆస్తి ఉంది. ఓ ప్రైవేట్ జెట్ కూడా ఉంది. చిరంజీవికి హైదరాబాద్‌లో ఇల్లు ఉంది. తెలుగు రాష్ట్రాల్లో ఆయనకు చాలా ఆస్తులు ఉన్నాయి. అదేవిధంగా బెంగళూరు శివార్లలో చిరంజీవికి ఫామ్‌హౌస్ ఉంది. సరదాగా గడపేందుకు అప్పుడప్పుడూ ఇక్కడికి వస్తుంటారు.

చిరంజీవి  అలాగే కొన్ని పండగల సమయంలో ఫ్యామిలీతో ఇక్కడ గడుపుతూ ఉంటారు. ఇప్పుడు చిరంజీవి ఊటీలో భూమి కొన్నారు. తమిళనాడులోని కొండ ప్రాంతంలో ఆయన స్థలం కొన్నారు. ఇప్పటికే రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయింది. ఈ స్థలం కోసం చిరంజీవి రూ.16 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. అంటే ఎకరాకు 2.6 కోట్ల రూపాయలు చెల్లించారన్న మాట.  చిరంజీవి ఈ భూమిని కొనడానికి కూడా ఓ  కారణం ఉంది. ఇక్కడ ఫామ్‌హౌస్ నిర్మించాలని ఆలోచిస్తున్నారట. అందుకే ఇక్కడ స్థలం కొన్నట్టు సమాచారం. మరోవైపు రామ్ చరణ్ దంపతులు కూడా ఇక్కడ స్థలం కొనాలని భావించారట.

Read more RELATED
Recommended to you

Latest news