భార్య వేరే వ్యక్తితో చనువుగా ఉంటుందని.. భర్త సూసైడ్!

-

భార్య భర్తల మధ్యలోకి మూడో వ్యక్తి ప్రమేయం వల్ల కాపురాలు కూలిపోతున్నాయి. కేవలం కాపురాలే కాదు.. ఒక్కోసారి మనుషులే ప్రాణాలు వదులుతున్నారు.దీనంతటికీ మితిమీరిన స్వేచ్ఛ, వివాహబంధం పట్ల దంపతులకు నమ్మకం లేకపోవడమే కారణమని నిపుణులు చెబుతున్నారు. భర్త, భార్య క్షణికసుఖాల కోసం చేసే తప్పులు ఎదుటివారు తీసుకోని పరిస్థితుల్లో ఇటువంటి ఘటనలు జరగుతున్నాయని సెలవిస్తున్నారు.

ఈ క్రమంలోనే ఓ వివాహిత వేరే వ్యక్తితో చనువుగా ఉంటుందని గ్రహించిన భర్త ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా యాచారం మండలం మొండి గౌరెల్లిలో సోమవారం ఆలస్యంగా వెలుగుచూసింది. గౌరెల్లికి చెందిన గంగనమోని నగేష్ (25)కు ఇటీవల ఒక మహిళతో వివాహం జరిగింది. గత కొంతకాలంగా తన భార్య మరొక వ్యక్తితో చనువుగా మాట్లాడుతోందని మనోవేదనకు గురైన నగేష్.. తన ఇంట్లో ఫ్యానుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. కాగా, ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news