IND Vs NZ : టెస్ట్ లో తడబడుతున్న టీమిండియా..!

-

టీమిండియా-న్యూజిలాండ్ జట్ల మధ్య మూడు టెస్ట్ సిరీస్ మ్యాచ్ లు జరుగనున్న విషయం తెలిసిందే. అయితే మొదటి రోజు నిన్న వర్షం కారణంగా బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో ఆట అసలు ప్రారంభం కాలేదు. టాస్ కూడా పడలేదు. ఇవాళ టీమిండియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. న్యూజిలాండ్ జరుగుతున్న మొదటి టెస్ట్ లో టీమిండియా కాస్త తడబడుతుందనే చెప్పాలి.

ముఖ్యంగా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న రోహిత్ సేనకు ప్రారంభంలోనే భారీ షాక్ తగిలింది. కెప్టెన్ రోహిత్ శర్మ (2), విరాట్ కోహీ(0), సర్ఫరాజ్  ఖాన్ (0), వెంట వెంటనే వెనుదిరిగారు. న్యూజిలాండ్ బౌలర్లు సౌథి, హెన్రీ నిప్పులు చెరిగే బంతులు వేయడంతో వీరు వెనుదిరిగారు. న్యూజిలాండ్ బౌలర్ల ధాటికి భారత బ్యాట్స్ మెన్స్ భయపడుతున్నారు. ప్రస్తుతం జైస్వాల్, రిషబ్ పంత్ క్రీజులో ఉన్నారు. భారత్ 10 పరుగుల వద్దనే 3 వికెట్లను కోల్పోయింది. ప్రస్తుతం 13/3 భారత్ స్కోర్.

Read more RELATED
Recommended to you

Latest news