నరసరావుపేటలో మందుబాబుల వీరంగం.. ప్రెగ్నెన్సీ వార్డులోనే!

-

పల్నాడు జిల్లాలోని నరసరావుపేటలో మందుబాబులు రెచ్చిపోయారు.ఫూటుగా మద్యం సేవించి బాటసారులను ఇబ్బందులకు గురిచేస్తున్నారు. ఈ క్రమంలోనే వారిపై చర్యలు తీసుకోవాలని స్థానికులు, మహిళలు డిమాండ్ చేస్తున్నారు.తాజాగా నరసరావుపేటలోని ప్రభుత్వ హాస్పిటల్ ప్రెగ్నెన్సీ వార్డులో కొందరు యువకులు మందు సేవించారు.

అది గమనించిన మహిళలు మద్యం తాగుతున్న యువకులను ప్రశ్నించారు. దీంతో ఆ మహిళలతో మందుబాబులు వాదనకు దిగారు.తాము కూడా పేషంట్ల కోసమే వచ్చామని, అసభ్య పదజాలంతో మందు బాబులు మహిళలతో దురుసుగా ప్రవర్తించారు. చివరకు హాస్పిటల్స్ సిబ్బంది జోక్యం చేసుకొని వారించటంతో అక్కడి నుంచి మందుబాబులు వెళ్లిపోయారు.వెంటనే పోలీసులు స్పందించి మందుబాబుల బెడదను తగ్గించాలని స్థానికులు, మహిళలు డిమాండ్ చేశారు.

 

Read more RELATED
Recommended to you

Latest news