ఢిల్లీలోని సీఆర్‌పీఎఫ్ స్కూల్ సమీపంలో పేలుడు..

-

దేశ రాజధాని ఢిల్లీలో పేలుడు కలకలం సృష్టించింది. రోహిణీ జిల్లా ప్రశాంత్ విహార్ ప్రాంతం సెంట్రల్ రిజర్వ్‌డ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్‌పీఎఫ్) పాఠశాల సమీపంలో ఈ పేలుడు సంభవించినట్లు తెలుస్తోంది. ఆదివారం ఉదయం 7:50 గంటల సమయంలో ఈ పేలుడు సంభవించగా.. స్థానికులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు.

స్కూల్ సరిహద్దు గోడ వద్ద పేలుడు జరిగినట్టు సమాచారం.విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలికి చేరుకున్నారు. ప్రస్తుతం అక్కడ అధికారులు సోదాలు జరుపుతున్నారు. ఎఫ్‌ఎస్‌ఎల్ టీమ్, బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్‌లు తనిఖీలు నిర్వహించగా.. పేలుడు జరిగిన వెంటనే అక్కడ దట్టమైన పొగ కమ్ముకున్నట్లు స్థానికులు వెల్లడించారు. పేలుడు వల్ల పాఠశాలకు ఎటువంటి నష్టం వాటిల్లలేదని అధికారులు తెలిపారు.పేలుడు ధాటికి సమీపంలోని వాహనాలు స్వల్పంగా దెబ్బతిన్నట్టు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news