ఏపీ హైకోర్టులో ముగ్గురు న్యాయమూర్తుల నియామకం

-

ఏపీ హైకోర్టులో కొత్తగా ముగ్గురు న్యాయమూర్తులు నియామకం అయ్యారు. దీనికి సంబంధించి అదనపు జడ్జిల నియామకానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలిపారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులో న్యాయ వాదులుగా సేవలందిస్తున్న కుంచం మహేశ్వరరావు, తూట చంద్ర ధనశేఖర్, చల్లా గుణరంజన్‌లను అదనపు జడ్జిలుగా నియమించేందుకు ఇటీవల సుప్రీంకోర్టు కొలీజియం కేంద్రానికి సిఫారసు చేసింది.

ఈ క్రమంలోనే కేంద్రం పంపిన సిఫాసులను తాజాగా రాష్ట్రపతి ఆమోదించారు. ఈ విషయాన్ని కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్‌రామ్ మేఘ్వాల్ శుక్రవారం సోషల్ మీడియా ‘ఎక్స్’ వేదికగా ప్రకటించారు. అదేవిధంగా కర్ణాటక హైకోర్టులో అదనపు జడ్జిగా ఉన్న జస్టిస్ సిద్ధయ్య రాచయ్యను అదే హైకోర్టులో శాశ్వత జడ్జిగా నియమించినట్లు పేర్కొన్నారు. తాజా నియామకాలతో ఏపీ హైకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య 29కి చేరుకుంది.

 

 

Read more RELATED
Recommended to you

Latest news