షర్మిల రాజకీయంగా ఒంటరి అయ్యారు.. భూమన సంచలన వ్యాఖ్యలు

-

వైఎస్ షర్మిల  రాజకీయంగా ఒంటరి అయ్యారని టీటీడీ మాజీ చైర్మర్ భూమన కరుణాకర్ రెడ్డి  అన్నారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్
రెడ్డి  కుమారుడిగా జగన్ ఇప్పటి వరకు ఏ తప్పూ చేయలేదని కామెంట్ చేశారు. వైఎస్ జగన్ లాంటి నాయకులు చాలా అరుదుగా ఉంటారని.. ఇచ్చిన మాట కోసం సర్వం వదులుకుంటారని పేర్కొన్నారు.

కుట్రలు, కుతంత్రాలతో తనపై తప్పుడు కేసులు పెట్టినా.. ఎలాంటి బెదురు లేకుండా వీరుడిలా పోరాడుతున్నాడని తెలిపారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో పార్టీ ఓటమి పాలైనా.. కోట్లాది మంది జనం జగన్ వెంటే ఉన్నారని ఆయన అన్నారు. కుటుంబ, రాజకీయ విమర్శలతో తోడబుట్టిన అన్న జగన్ ను, షర్మిల,  నిర్వీర్యం చేసేందుకు ప్రయత్నిస్తోందని ఆయన ఆరోపించారు. అశేష ప్రజల ప్రేమాభిమానాలు పొందిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రతిష్టను షర్మిల దిగజార్చేలా చేయడం బాధాకరమని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news