ఏపీలో పత్తి కొనుగోళ్లు ప్రారంభం.. ధర ఎంతంటే..?

-

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం సహకారముతో కాటన్ కార్పొరేషన్ అఫ్ ఇండియా రాష్ట్రములో 2024-25 సీజన్ కు సంబదించి పత్తి కొనుగోలు కొరకు రైతులు రైతు సేవా కేంద్రములలో నమోదును 27 అక్టోబర్ 2024 నుండి ప్రారంభించడం జరిగింది అని ఏపీ మార్కెటింగ్ శాఖ పేర్కొంది. కాబట్టి రైతులు, వారి యొక్క పంట వివరములను రైతు సేవా కేంద్రముల నందు నమోదు చేసుకోనవలసినదిగా అవగాహన కల్పించారు.

అయితే సి.సి.ఐ నాణ్యత ప్రమాణములు ఉన్నటువంటి పత్తిని మాత్రమే కొనుగోలు చేస్తుంది కాబట్టి రైతులు నాణ్యమైన విడి పత్తిని కొనుగోలు కేంద్రములకు తీసుకొని రావలసినదిగా ఏపీ మార్కెటింగ్ శాఖ సూచించింది. ఈ విషయమై వ్యవసాయ మార్కెటింగ్ శాఖ మాత్యులు సమీక్షించి రైతులకు సరైనా అవగాహన కల్పించి మద్దతు ధరకు పత్తిని సి.సి.ఐ. వారికి విక్రయించేందుకు అన్ని ఏర్పాట్లు చేయడమైనదని తెలియజేసినారు. ఇక ఖరీప్ 2024-25 సీజన్ కు సంబంధించి భారత ప్రభుత్వం ప్రకటించిన పత్తి కనీస మద్దతు ధరలు.. పొడవు పింజ క్వింటా 7521.. పొట్టి పింజ క్వింటా 7121గా ఉన్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news