బ్రేకింగ్‌: షాక్ ఇచ్చిన బంగారం ధ‌ర‌.. వెండి కూడా పైపైకే..

-

గత మూడు రోజులుగా త‌గ్గుతూ వ‌స్తున్న బంగారం ధ‌ర ఈ రోజు భారీగా పైకెగ‌సింది. హైదరాబాద్ మార్కెట్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర సోమవారం భారీగా పెరిగింది. ఏకంగా రూ.710 ర్యాలీ చేసింది. దీంతో బంగారం ధర రూ.41,050 నుంచి రూ.41,760కు పెరిగింది. అదేసమయంలో 22 క్యారెట్ల బంగారం ధర కూడా పెరిగింది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.190 పెరుగుదలతో రూ.38,090 నుంచి రూ.38,280కు ర్యాలీ చేసింది. బంగారం ధర పరుగులు పడుతూ ఉంటే కేజీ వెండి ధర ర్యాలీ చేసింది. కేజీ వెండి ధర ఈ రోజు రూ.100 పెరుగుదలతో రూ.49,500కు చేరింది.

ఢిల్లీ మార్కెట్‌లో కూడా బంగారం ధర పెరిగింది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.200 పైకి కదిలింది. దీంతో ధర రూ.39,100కు చేరింది. అదే స‌మ‌యంలో 24 క్యారెట్ల బంగారం ధర కూడా రూ.200 పెరుగుదలతో రూ.40,300కు పెరిగింది. ఇక కేజీ వెండి ధర కూడా రూ.100 పెరుగుదలతో రూ.49,500కు ఎగసింది.

Read more RELATED
Recommended to you

Latest news