కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ కు మ్యాటర్ ఎక్కువ.. మీటర్ తక్కువ : ఎంపీ మార్గాని భరత్

-

రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్ కు మ్యాటర్ ఎక్కువ.. మీటర్ తక్కువ అని మాజీ ఎంపీ మార్గాని భరత్ పేర్కొన్నారు. సూపర్ సిక్స్ హామీలకు అనుగుణంగా బడ్జెట్ ఎందుకు రూపొందించలేకపోయారని ప్రశ్నించారు. గత బడ్జెట్ లో ప్రవేశపెట్టిన అన్నదాత సుఖీభవ పథకంలో  20వేల రూపాయలు రైతులందరికీ ఇస్తామని చెప్పి ఎందుకు ఇవ్వలేదు అని క్వశ్చన్ చేశారు. 50 లక్షల మంది రైతులకు అన్నదాత సుఖీభవ అందించాలంటే 11వేల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది.. మీరెంత కేటాయించారని ఎంపీ భరత్ ప్రశ్నించారు.

తల్లికి వందనం పథకంలో భాగంగా 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం స్టూడెంట్ వరకు ఉన్న 87 లక్సల మంది విద్యార్థులకు 12వేల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని మాజీ ఎంపీ భరత్ రామ్ అన్నారు. కూటమి ప్రభుత్వం మాత్రం కేవలం 9400 కోట్లు మాత్రమే కేటాయించారు. ఎవరికీ కోత విధిస్తారని ప్రశ్నించారు. రాష్ట్రంలో 20లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు. నిరుద్యోగ భృతి ఎక్కడ.. దావోస్ లో ఒక్క రూపాయి అయినా పెట్టుబడులు సాధించారా అని మండిపడ్డారు. 

Read more RELATED
Recommended to you

Latest news