క్లీన్ చిట్తో మళ్లీ నేషనల్ హైవేలా దూసుకెళ్తానని జనసేన నేత కిరణ్ రాయల్ పేర్కొన్నారు. తాజాగా ఆయన మీడయాతో మాట్లాడారు. తిరుపతిలో కాపులను రాజకీయంగా తొక్కాలని చూస్తున్నారు. “నేను ఏ తప్పు చేయలేదు అని పవన్ కళ్యాణ్కి తెలిసి విచారణ చేయమన్నారు. నాపై చేసిన కుట్రలను ఆధారాలతో సహా పవన్ కళ్యాణ్ ముందు ఉంచుతా. నాకు, లక్ష్మిరెడ్డికి కేవలం ఆర్థిక లావాదేవీలు మాత్రమే ఉన్నాయి.
నేను ఏ తప్పు చేయలేదు.. నాతో పాటు ఉన్నవాళ్లే నన్ను నమ్మలేదు. నేను మంచోడిని కాబట్టే నిలబడ్డా.. వేరే వాళ్ళైతే ఆత్మహత్య చేసుకునేవారు. వైసీపీలో రాసలీలల రాజాలు చాలామందే ఉన్నారు. వారు నిజాయితీ పరులా?” అని ప్రశ్నించారు కిరణ్ రాయల్.