కేసీఆర్ చావు కోరుకోవడం దారుణం.. హరీశ్ రావు సంచలన వ్యాఖ్యలు

-

తెలంగాణ కోసం తన ప్రాణాలను పణంగా పెట్టిన కె. చంద్రశేఖర్ రావు చావును కోరుకోవడం ఎంత దారుణమో బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో కేసీఆర్ చావును కోరుతూ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన హరీష్ రావు, దీనికి నిరసనగా శాసనసభలో సీఎం ప్రసంగాన్ని బహిష్కరించినట్లు తెలిపారు.
అసెంబ్లీలో మీడియాతో చిట్ చాట్ చేసిన హరీష్ రావు, కృష్ణా జలాల్లో తెలంగాణకు జరిగిన అన్యాయానికి పూర్తి బాధ్యత కాంగ్రెస్ పార్టీదేనని ఆరోపించారు.

మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి  అసెంబ్లీలో పూర్తిగా అబద్ధాలు చెప్పారని విమర్శించారు. కాంగ్రెస్ నిర్లక్ష్యం వల్లే 299 టీఎంసీల కృష్ణా నీటి పంపకాలు జరిగాయని, నిజానికి తెలంగాణలో అంత నీటిని వినియోగించేందుకు తగినన్ని ప్రాజెక్టులే లేవని అన్నారు. కాంగ్రెస్ ప్రాజెక్టులను నిర్మించలేకపోవడమే ఈ అన్యాయానికి కారణమని పేర్కొన్నారు. కేసీఆర్ చేసిన అంచెలంచెల పోరాటం వల్లనే తెలంగాణకు నీటి న్యాయం సాధ్యం అయిందని పేర్కొన్నారు హరీశ్ రావు. సెక్షన్ 3 ని సాధించి 573 టీఎంసీల నీటిని తెలంగాణకు తెచ్చిన ఘనత కేసీఆర్ దేనని పేర్కొన్నారు. రాయలసీమ లిప్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ పై స్టే తెచ్చింది కూడా బీఆర్ఎస్ ప్రభుత్వమేనని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news