ఇవాళ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్ చూస్తే హామీల ఎగవేతల బడ్జెట్ లా ఉందని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆరోపించారు. ఇది మొండి చేయి ఇచ్చే బడ్జెట్.. గొప్పలు చెప్పుకునే బడ్జెట్ అన్నారు. కేవలం 36వేల కోట్లతో అభివృద్ధి ఎలా సాధ్యమో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చెప్పాలన్నారు. ఈ రాష్ట్రాన్ని దివాలా తీసేలా బడ్జెట్ పెట్టారని మండిపడ్డారు. ఆదాయం చరానా.. అప్పు బరానా అన్నట్టు ఉందన్నారు. బడ్జెట్ నిండా అప్పులే ఉన్నాయి.. రాష్ట్ర అప్పులు మరింత పెరిగే సూచిక ఉందని.. ఇన్ని రకాలుగా అప్పులు చేసిన ఏం అభివృద్ధి చేసారని ప్రశ్నించారు.
రైతు భరోసా కి నిధులు ఏరకంగా సరిపోతాయనేది చెప్పాలని బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి ప్రశ్నించారు. వ్యవసాయ కూలీలకు బడ్జెట్ కేటాయించకపోవడం బాధకరం అన్నారు. రైతులను మోసం చేసేలా ఉంది ఈ బడ్జెట్. రైతులకు ఇచ్చిన హామీలు 42వేల కోట్లు అవసరం అన్నారు. ఎక్కడ బడ్జెట్ లో పెట్టకపోవడం చూస్తే.. మరోసారి రైతులను మోసం చేయబోతున్నారని అర్థం అవుతుంది. బీసీ సబ్ ప్లాన్ ప్రకారం.. బడ్జెట్ ప్రవేశపెట్టకపోవడం ఎలా అని ప్రశ్నిస్తున్నాం. మైనార్టీలతో పోల్చుకుంటే 16వేల కోట్లు బీసీలకు ఇవ్వాల్సి వస్తుందన్నారు.