వైసీపీ కి, ఎమ్మెల్సీ సభ్యత్వానికి మర్రి రాజశేఖర్ రాజీనామా చేసిన విషయం అందరికీ విదితమే. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి విడదల రజినీ మర్రి రాజీనామా పై తాజాగా స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ ఆమె చిలుకలూరిపేట మాట్లాడుతూ.. రాజీనామా చేసిన మర్రి రాజశేఖర్ ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాలని అన్నారు. వ్యక్తి గతంగా మాజీ సీఎం జగన్, వైఎస్ కుటుంబం ఆయనకు సముచిత గౌరవం ఇచ్చిందని తెలిపారు.
పార్టీలో ఎక్కడా ఆయన గౌరవానికి భంగం వాటిల్లేలా ఎలాంటి పనులు కూడా చేయలేదన్నారు. మర్రి గెలుపు కోసం వైఎస్ జగన్ కూడా ప్రచారం చేశారని.. రెడ్ బుక్ పాలనలో తన వాయిస్ వినిపించే ఉంటే ఆయన గౌరవం మరింత పెరిగి ఉండేదని తెలిపారు. జగన్ చెబితేనే తాను గుంటూరు వెస్ట్ నుంచి పోటీ చేశానని.. తిరిగి ఆయన పంపితేనే చిలుకలూరిపేటకు వచ్చానని కామెంట్ చేశారు. తమ అధినేత ఆదేశాలను పాటించడమే తనకు తెలుసు అని స్పష్టం చేశారు విడదల రజినీ.