కాంగ్రెస్ పార్టీకి మాజీ ఎమ్మెల్సీ కపిలవాయి దిలీప్ కుమార్ రాజీనామా చేశారు. అనంతరం రాష్ట్రీయ లోక్ దళ్ పార్టీ అధ్యక్షుడు జయంత్ చౌదరి సమక్షంలో ఆయన పార్టీలో చేరారు.
మాజీ ఎమ్మెల్సీ కపిలవాయి దిలీప్ కుమార్ను రాష్ట్రీయ లోక్ దళ్ పార్టీ తెలంగాణ, మహారాష్ట్ర ఇంచార్జ్గా ఆ పార్టీ అధ్యక్షుడు జయంత్ చౌదరి నియమించారు. దీంతో దేశరాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ క్రమంగా పడిపోతున్న తరుణంలో ఎన్నో ఏళ్లుగా హస్తం పార్టీలో కొనసాగుతున్న కపిలవాయి పార్టీని వీడటం నిజంగా దెబ్బేనని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.