ఇవాళ శ్రీకాకుళం జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన

-

ఇవాళ శ్రీకాకుళం జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. మత్స్యకారులకు గుడ్ న్యూస్ చెప్పింది ఏపీ ప్రభుత్వం. వేట నిషేధ సమయంలో జాలర్లకు అందించే ఆర్థిక సాయం పెంచింది. ‘మత్స్యకార సేవలో’ పేరుతో జాలర్లకు రూ.20 వేల చొప్పున ఆర్థిక సాయం చేయనుంది. ఈ పథకం కింద 1,29,178 కుటుంబాలకు రూ. 258 కోట్ల మేర లబ్ది చేకూరనుంది.

CM Chandrababu Naidu’s visit to Srikakulam district today

ఈ తరుణంలో ఇవాళ శ్రీకాకుళం జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. ” మత్స్యకారుల సేవలో ” పథకాన్ని ప్రారంభించనున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు… సముద్రంలో వేటకు విరామ సమయంలో ఆర్థిక సాయం అందించనుంది. మత్స్యకారుల కుటుంబాలకు రూ.20 వేల చొప్పున జమ చేస్తారు. అనంతరం మత్స్యకారులతో సీఎం చంద్రబాబు ముఖాముఖీ ఉంటుంది.

Read more RELATED
Recommended to you

Latest news