అమరావతి (రాజమండ్రి): ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపై మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్కుమార్ మరోసారి ఫైర్ అయ్యారు. చంద్రబాబు పనులతో అంతర్జాతీయంగా ఆంధ్రప్రదేశ్ పరువుతో పాటు దేశం పరువుకూడా పోతుందని వ్యాఖ్యానించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో అసలు జరగని ప్రకృతి వ్యవసాయం కోసం రూ. 16,600 కోట్ల ఒప్పందాన్ని చేసుకున్నారని విమర్శించారు. 2019 నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి అవుతుందని టీడీపీ చెబుతుంటే.. ఇంజనీర్లు నవ్వుకుంటున్నారని, 2019 నాటికి పోలవరం పూర్తి కాదని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. చంద్రబాబు ప్రభుత్వంలో నెంబర్ 2గా కుటుంబరావు కొనసాగుతున్నారని, తాను చేసిన ఆరోపణలపై కుటుంబరావు స్పందించడం లేదని ఉండవల్లి విమర్శించారు.
చంద్రబాబు రాష్ట్రం పరువే కాదు, దేశం పరువూ తీస్తున్నారు: ఉండవల్లి
By Anil Kumar
-
Previous article
Next article