మోడీ డైర‌క్ష‌న్‌.. ఈసీ యాక్ష‌న్‌: క‌న‌క‌మేడ‌ల‌

-

అమరావతి: కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాని మోదీ కనుసన్నల్లో పని చేస్తోందని తెలుగుదేశం ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ ఆరోపించారు. బీజేపీతో కుమ్మక్కై వైసీపీ ఎంపీలు రాజీనామా చేశారని, అందుకే రాజీనామాలు చేసినా ఎన్నిక‌లు జ‌ర‌గ‌కుండా స్కెచ్ వేశార‌ని ఆరోపించారు. మోదీకి వ్యతిరేకంగా మాట్లాడాల్సి వస్తోందనే వైసీపీ ఎంపీలు రాజీనామా చేశారని కనకమేడల ఆరోపించారు. ఎన్నికల తర్వాత దేశం వదిలి పారిపోయే ఆలోచనలో వైసీపీ నేతలు ఉన్నారని వ్యాఖ్యానించారు. విజయసాయిరెడ్డిపై 11 కేసులున్నాయని, చంద్రబాబుపై ఒక్క కేసు కూడా లేదన్నారు. జగన్ రూ.43వేల కోట్లు దోచుకోవడానికి ప్రధాన సూత్రధారి విజయసాయిరెడ్డి అని ఆరోపించారు.

Read more RELATED
Recommended to you

Latest news