పడి పడి లేచే మనసు.. టీజర్ అదిరిపోయింది

-

శర్వానంద్, సాయి పల్లవి జంటగా హను రాఘవపుడి డైరక్షన్ లో వస్తున్న సినిమా పడి పడి లేచే మనసు. చెరుకూరి సుధాకర్ నిర్మిస్తున్న ఈ సినిమా టీజర్ కొద్ది నిమిషాల క్రితం రిలీజ్ అయ్యింది. యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా రాబోతున్న ఈ సినిమా టీజర్ యువతని ఆకట్టుకునేలా ఉంది. హీరోయిన్ ను ఫాలో అవుతున్న హీరో.. అది గమనించిన హీరోయిన్.. ఫైనల్ గా ఏంటి నేనెక్కడికెల్తే అక్కడకి వస్తున్నావ్ అని డైరెక్ట్ గా అడిగితే అర్రెర్రె తెలిసిపోయిందా.. నా పాటికి నేనేదో ఫాలో అవుతుంటే అంటూ హీరో అనడం క్రేజీగా అనిపించింది.

చూస్తుంటే శర్వానంద్, సాయి పల్లవిలు కలిసి ఈ సినిమాతో అదిరిపోయే హిట్ కొట్టేలా ఉన్నారని చెప్పొచ్చు. విశాల్ చంద్రశేఖర్ మ్యూజిక్ కూడా నిమిషం టీజర్ లో ఇంప్రెసివ్ గా అనిపించింది. శర్వానంద్, సాయి పల్లవిల జంట ఆకట్టుకుంది. డిసెంబర్ 21న రిలీజ్ కాబోతున్న ఈ సినిమా ఎలా ఉండబోతుందో చూడాలి. మహానుభావుడు తర్వాత శర్వానంద్, ఎం.సి.ఏ తర్వాత సాయి పల్లవి నటిస్తున్న ఈ సినిమాపై టీజర్ అంచనాలు పెంచేసింది.

Read more RELATED
Recommended to you

Latest news