బ్రేకింగ్; మారుతీ రావు పోస్ట్ మార్టం నివేదిక బయటపెట్టిన వైద్యులు…!

-

మిర్యాలగూడ ప్రణయ్ హత్య కేసులో నిందితుడు, అమృత తండ్రి మారుతీరావు పోస్ట్ మార్టం నివేదిక బయటకు వచ్చింది. ఫోరెన్సిక్ నిపుణులు దానిని బయటపెట్టారు. ఆయన ఆదివార౦ హైదరాబాద్‌లోని ఆర్యవైశ్యభవన్‌లో ఆత్మహత్యకు పాల్పడ్డారు. విషం తీసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారని పోలీసులు గుర్తించారు. ఇక ఇది పక్కన పెడితే ఆయన పోస్ట్ మార్టం నివేదికను వైద్యులు బయటపెట్టారు.

ఆయన విషం తీసుకోవడం వల్లే చనిపోయారని, ఒంటిపై ఎలాంటి గాయాలు లేవని వారు తమ నివేదికలో బయటపెట్టారు. విషం తీసుకోవడం వల్లే ఆయన శరీరం రంగు మారిందని, శరీరానికి రక్తప్రసరణ ఆగిపోవడంతో గుండె పోటు వచ్చిందని, బ్రెయిన్‌డెడ్ అయ్యారని ప్రాథమిక రిపోర్టులో వైద్యులు స్పష్టం చేసారు. ఆయన అంత్యక్రియలు నేడు జరుగుతున్నాయి. ఈ అంత్యక్రియలకు ఆయన అభిమానులు హాజరవ్వడం గమనార్హం.

ఇక అమృత ను ఆమె తల్లి రానీయలేదని కొందరు అంటున్నారు. అయితే దీంట్లో వాస్తవం లేదని పలువురు అంటున్నారు. అయితే ఆయన ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారు అనేది స్పష్టత రావడ౦ లేదు. ఆయన ఆత్మహత్యకు ఆస్తి తగాదాలు కారణమా అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. తమ్ముడి తో ఉన్న ఆస్తి విభేదాలే కారణమని పోలీసులు కూడా అనుమానిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news