యాదాద్రిలో విషాదం..మహిళ దారుణ హత్య..కల్లు తాగించి మరీ..ఆ పనులు !

-

యాదాద్రిలో విషాదం నెలకొంది. యాదాద్రి జిల్లా తుర్కపల్లి (మ) తిర్మలపూర్ అటవీ ప్రాంతంలో మహిళ దారుణ హత్యకు గురైంది. ఈ నెల 11న మెదక్ జిల్లా మాసాయిపేట (మం) సాజుతండాకి చెందిన మాలోతు లలిత(50) అదృశ్యమైంది. ఇక ఈ నెల 14న చేగుంట పోలీసులకు ఫిర్యాదు చేశారు లలిత కుటుంబ సభ్యులు. తూప్రాన్ (మం) ఘనపూర్ కి చెందిన దంపతులపై అనుమానంతో విచారించగా హత్యచేసినట్టు ఒప్పుకున్నారు నిందితులు.

యాదాద్రిలో విషాదం..మహిళ దారుణ హత్య..కల్లు తాగించి మరీ..ఆ పనులు !

ఈ నెల 11న కల్లు తాగించి ఒంటిపై నగల కోసమే హత్య చేసినట్టు భార్యాభర్తలు వెల్లడించారు. అటవీ ప్రాంతంలో పడేయడంతో కుళ్ళిపోయిన స్థితిలో మృతదేహం లభ్యమైంది. అనంతరం భువనగిరి ప్రభుత్వ ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగించారు పోలీసులు. పోలీసుల అదుపులో నిందితులు ఉన్నారు. ఈ రోజు మధ్యాహ్నం ప్రెస్ మీట్ పెట్టి వివరాలు వెల్లడించనున్నారు పోలీసులు.

Read more RELATED
Recommended to you

Latest news