భారత రక్షణనిధికి స్పీకర్ అయ్యన్న పాత్రుడు విరాళం

-

ఇండియా-పాకిస్తాన్ మధ్య మరోసారి ఉద్రిక్తత పరిస్తితులు చోటు చేసుకున్నాయి. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు జాతీయ రక్షణ నిధికి విరాళం అందించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడారు. ఉగ్రవాద నిర్మూలనలో భారత సాయుధ దళాలు ప్రదర్శిస్తున్న ధైర్య సాహసాలు దేశ ప్రజలందరికీ గర్వకారణంగా నిలుస్తున్నాయని చెప్పారు.

భారతదేశం సాయుధ దళాల చేస్తున్న ధైర్య సాహసాలు ప్రతీ భారతీయునిలో గర్వాన్ని కలిగిస్తున్నాయని తెలిపారు. దేశ రక్షణ కోసం ప్రాణాలను పణంగా పెట్టి పోరాడుతున్న వీర జవాన్లకు సంఘీభావం తెలిపారు. అలాగే తన నెల వేతనాన్ని జాతీయ రక్షణ నిధికి విరాళంగా ఇచ్చినట్టు స్పీకర్ అయ్యన్నపాత్రుడు తెలిపారు. ఈ మేరకు తన నెల జీతం రూ.217,000లను ఆన్ లైన్ ద్వారా జాతీయ రక్షణ నిధికి ట్రాన్స్ ఫర్ చేసినట్టు.. రిసిప్ట్ ను కూడా ఆయన విడుదల చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news