నాగం జనార్దన్ రెడ్డి కుమారుడు మృతి

-

మాజీ మంత్రి, కాంగ్రెస్ నాయకుడు నాగం జనార్దన్ రెడ్డి తనయుడు నాగం దినకర్ రెడ్డి గురువారం రాత్రి అనారోగ్యంతో మృతి చెందారు. గత కొద్ది రోజుల క్రితం ఊపిరితిత్తుల  సంబంధిత వ్యాధితో హైదరాబాద్లోని అపోలో ఆసుపత్రిలో చికిత్సపొందుతున్నారు.. గురువారం ఉదయం నుంచి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తడంతో డాక్టర్లు వారి శక్తిమేరకు ప్రయత్నాలు చేశారు. పరిస్థితి విషమించడంతో గురువారం రాత్రి తుది శ్వాస విడిచారు. కుమారుడి ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్న నాగం జనాగర్దన్ రెడ్డి నిన్న పార్టీ కార్యక్రమాలను రద్దు చేసుకుని ఆసుపత్రికి చేరుకున్నారు. మరణవార్త వినగానే నాగం శోకసంద్రంలో మునిగారు. నాగంకు ఇద్దరు కుమారులు, కుమార్తె ఉండగా ..పెద్దకుమారుడైన దినకర్ రెడ్డి వ్యాపారాలు, కాంట్రాక్టులు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news