BREAKING: ఛత్తీస్‌గఢ్‌లో మరో భారీ ఎన్ కౌంటర్.. 20 మంది మావోయిస్టులు మృతి !

-

మావోయిస్టులకు మరో ఎదురుదెబ్బ. తాజాగా 20 మంది మావోలు మృతి చెందారు. ఛత్తీస్‌గఢ్‌‌లో మరోసారి భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. నారాయణపూర్ జిల్లా మాడ్ ప్రాంతంలో పోలీసులు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరగ్గా.. 20 మంది మావోలు మృతి చెందారు.

Another major encounter in Chhattisgarh.. 20 Maoists killed

ఈ రోజు నుంచి ఎదురు కాల్పులు కొనసాగుతున్నాయి. ఈ కాల్పుల్లో మావోయిస్టుల పొలిట్‌బ్యూరో సభ్యుడు మరణించినట్లు తెలుస్తోంది. మావోయిస్టులను మట్టుపెట్టేందుకు… కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగార్ తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. ఈ ఆపరేషన్ మొదలైనప్పటి నుంచి… వందల సంఖ్యలో మావోయిస్టులు మృతి చెందారు. ముఖ్యంగా ఛత్తీస్గఢ్ లో ఈ పరిస్థితులు నెలకొన్నాయి. మావోయిస్టులకు అడ్డగా మారిన చత్తీస్గడ్ వేదికగా ఆపరేషన్ మొదలుపెట్టారు. ఇందులో భాగంగానే ఇవాళ 20 మంది మావోయిస్టులు మృతి చెందినట్లు వార్తలు వస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news