టీడీపీ మహానాడు వేదికగా నారా లోకేష్ సంచలన ప్రకటన చేశారు. 6 శాసనాలు జారీ చేసారు. టీడీపీ అంటేనే పేదల పార్టీ.. వారి భవిష్యత్తు కోసం 6 శాసనాలు ప్రతిపాదిస్తున్నాను అని తెలిపారు నారా లోకేష్.

1. తెలుగుజాతి విశ్వఖ్యాతి, 2. యువగళం, 3. స్త్రీ శక్తి, 4. పేదల సేవల్లో సోషల్ రీఇంజనీరింగ్, 5. అన్నదాతకు అండగా, 6. కార్యకర్తే అధినేత అంటూ పేర్కొన్నారు. తెలుగుజాతి కోసం పుట్టిన ఏకైక పార్టీ టీడీపీ అని తెలిపారు నారా లోకేష్.
మాజీ మంత్రి రోజా నాకు చీర, గాజులు పంపిస్తాన్నారు.. పంపించమని చెప్పాను అన్నారు నారా లోకేష్. రోజా పంపించే చీర, గాజులను మా అక్కచెల్లెళ్లకు పెట్టు ఆశీర్వాదం తీసుకుంటానని చెప్పాను అని గుర్తు చేసారు. చట్టాలు, శిక్షల వల్ల సమాజంలో మార్పు రాదు.. మన ఇంట్లో మార్పు మొదలైతేనే సమాజంలో మార్పు వస్తుందన్నారు నారా లోకేష్.