ఏపీలో తీవ్ర విషాదం.. మాజీ ఎంపీ మృతి

-

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెను విషాదం చోటు చేసుకుంది. ఏపీకి సంబంధించిన మాజీ పార్లమెంటు సభ్యులు కన్నుమూశారు. మచిలీపట్నం మాజీ పార్లమెంటు సభ్యులు, చల్లపల్లి జమిందార్ తనయుడు యార్లగడ్డ అంకినీడు ప్రసాద్ మృతి చెందారు. 86 సంవత్సరాల యార్లగడ్డ అంకినీడు ప్రసాద్ కాసేపటి క్రితమే మృతి చెందారు.

Former Machilipatnam MP and Challapalli Zamindar's son Yarlagadda Ankineedu Prasad passes away
Former Machilipatnam MP and Challapalli Zamindar’s son Yarlagadda Ankineedu Prasad passes away

వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న అంకివీడు ప్రసాద్… కోయంబత్తూర్ లోని ఆయన స్వగృహంలో ఇవాళ మరణించారు. 1967 సంవత్సరంలో బందర్ ఎంపీగా ఎంపికైన ఆయన ఆ ప్రాంత అభివృద్ధికి చాలా కష్టపడ్డారు. అభిమానుల సందర్శనార్థం రేపు చల్లపల్లి కి భౌతిక కాయన్ని తరలించబోతున్నారు. ఇక ఆయన మృతితో ఏపీలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news