కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత తిరుమల శ్రీవారి సన్నిధిలో ఏదో ఒక అపచారం బయట పడుతోంది. భద్రత వైఫల్యం కారణంగా… కొంతమంది అపరిచితులు రెచ్చిపోతున్నారు. గడిచిన ఏడాది కాలంలో దాదాపు 10 సంఘటనలు జరిగాయి. ప్రభుత్వం ఎన్ని కఠిన చర్యలు తీసుకున్నప్పటికీ కొంతమంది రెచ్చిపోతున్నారు.

అన్యమత వాహనాలను పైకి తీసుకురావడం…. మాంసం తిరుమల కొండపైకి తీసుకురావడం… కానిస్టేబుల్స్ రెచ్చిపోవడం , తిరుమల కొండపై నుంచి విమానాలు వెళ్లడం ఇలాంటి సంఘటనలు జరిగాయి. అయితే తాజాగా తిరుమలలో మరో అపచారం బయటపడింది. తిరుమల శ్రీవారి సన్నిధిలో మందుబాబులు విచ్చలవిడిగా మందు తాగుతూ కనిపించారు.
మందు తాగిన తర్వాత బాటిల్లను మెట్లపై విసిరితో రచ్చ రచ్చ చేశారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. అయితే ఈ వీడియో బయటకు రావడంతో టీటీడీ అధికారులు అలర్ట్ అయినట్లు తెలుస్తోంది. ఆ మందుబాబుల కోసం గాలిస్తున్నారు.
రోజురోజుకు దిగజారుతున్న తిరుమల ప్రతిష్ట
శ్రీవారి సన్నిధిలో మద్యం తాగుతున్న మందు బాబులు
మందు తాగేసి బాటిల్స్ను మెట్లపై విసురుతున్న మందుబాబులు pic.twitter.com/WbJplIm5Xn
— Telugu Scribe (@TeluguScribe) June 8, 2025