ఏపీలో పొగాకు కొనుగోళ్ల నిమిత్తం రూ.150 కోట్లు !

-

సీఎం చంద్రబాబుతో పీయూష్ గోయల్ భేటీ..ముగిసింది. పొగాకు కొనుగోళ్లు, పామాయిల్ పై దిగుమతి సుంకం తగ్గింపు, ఆక్వా ఎగుమతులు, మ్యాంగో పల్స్ పై జీఎస్టీ తగ్గింపుపై చర్చ జరుగుతోంది. టొబాకో బోర్డు ద్వారా ఏపీలో పొగాకు కొనుగోళ్ల నిమిత్తం రూ.150 కోట్లు కేటాయించాలని చంద్రబాబు నాయుడు వినతి అందించారు.

Union Minister Piyush Goyal to Amaravati today

150 crore for tobacco purchases in AP

పొగాకు ధరలు తగ్గిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వమే రూ.300 కోట్లతో 20 మిలియన్ కేజీలు కొనుగోలు చేస్తున్నట్టు వెల్లడించారు. బాపట్ల, గుంటూరు, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో ఏడు చోట్ల పొగాకు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశామని వివరించారు సీఎం చంద్రబాబు నాయుడు. పొగాకు కొనుగోళ్ల నిమిత్తం రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసే రూ.300 కోట్లలో టొబాకో బోర్డు రూ.150 కోట్లు భరించేలా చూడాలన్నారు చంద్రబాబు.

Read more RELATED
Recommended to you

Latest news