సాక్షి న్యూస్ పేపర్ షేర్ చేసిన నారా లోకేష్ !

-

సాక్షి న్యూస్ పేపర్ షేర్ చేశారు ఏపీ మంత్రి నారా లోకేష్. తల్లికి వందనం సూపర్ సక్సెస్ అయిందని పేర్కొన్నారు. సాక్షి లో వచ్చిన వార్తకు కౌంటర్ ఇస్తూ… సాక్షి న్యూస్ పేపర్ షేర్ చేశారు ఏపీ మంత్రి నారా లోకేష్. తల్లుల కళ్లలో ఆనందం చూసి జగన్ రెడ్డి గారి కడుపు మంట మూడింతలు పెరిగిందని ఫైర్ అయ్యారు.

Nara Lokesh shared the Sakshi newspaper
Nara Lokesh shared the Sakshi newspaper

మరోసారి తన విష పత్రికలో ఫేక్ ప్రచారానికి తెరలేపారు. ఆరుగురు కంటే ఎక్కువ పిల్లలు ఉన్న తల్లులు, లేదా అనాథ శరణాలయాల్లో ఉంటున్న పిల్లలకు ఇంకా డబ్బులు జమ చేయలేదు. గ్రామ సచివాలయం, లేదా వార్డు సచివాలయం సిబ్బంది ఫీల్డ్ వెరిఫికేషన్ చేసిన తరువాత మాత్రమే వారికి నిధులు విడుదల అవుతాయని చెప్పారు.

దొంగ లెక్కలు, డబ్బులు కొట్టేయడం మీ బ్రాండ్ జగన్ రెడ్డి గారు. మీ పాలనలో జరిగిన అవినీతి, అక్రమాలే అందరూ చేస్తారు అనుకుంటే ఎలా? మాది ప్రజా ప్రభుత్వం తప్పు చెయ్యం..చెయ్యనివ్వం. జగన్ రెడ్డి గారూ కడుపు మంటగా ఉన్నట్టుంది. రెండు ఈనో ప్యాకెట్లు పంపిస్తాను వాడండి.. కాస్త తగ్గుద్దన్నారు లోకేష్.

Read more RELATED
Recommended to you

Latest news