పిఎం కిసాన్ సమ్మాన్ నిధి 20వ ఇన్స్టాల్మెంట్ కు సంబంధించిన వివరాలు ఇవే..!

-

భారతదేశ ప్రభుత్వం ఎన్నో పథకాలను ప్రవేశపెడుతూ వస్తుంది. పైగా వీటివలన చాలా శాతం మంది ఎన్నో ప్రయోజనాలను పొందుతున్నారు. అదే విధంగా, రైతులకు సంబంధించి పి ఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకాన్ని కూడా ప్రభుత్వం ప్రవేశపెట్టడం జరిగింది. ఈ పథకానికి సంబంధించిన 20వ ఇన్స్టాల్మెంట్ ను కేంద్ర ప్రభుత్వం విడుదల చేయడానికి సంబందించిన వివరాలను ప్రకటించింది. అయితే దీనికి సంబంధించిన ఇన్స్టాల్మెంట్ ను జూన్ 20వ తేదీన విడుదల చేస్తుందని తెలిపింది. అయితే, ఈ పథకానికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా రాబోతుందని ప్రభుత్వం తెలియజేసింది.

పి ఎం కిసాన్ పథకం ద్వారా పేద రైతులకు ఆర్థిక భరోసాను అందజేస్తోంది. ఈ పథకం ద్వారా రైతులు సంవత్సరానికి 6000 రూపాయలను ఆర్థిక సహాయం పొందుతారు. అంతేకాక, పి ఎం కిసాన్ పథకానికి సంబంధించిన ఇన్స్టాల్మెంట్ ను రైతుల బ్యాంకు ఖాతాలోకి జమ చేస్తుందని ప్రభుత్వం తెలియజేసింది. 19వ ఇన్స్టాల్మెంట్‌ కు సంబంధించి రైతుల బ్యాంకులలో 22 వేల కోట్లకు పైగా ప్రభుత్వం బదిలీ చేసింది. అదే విధంగా, ఈ పథకానికి సంబంధించిన 20వ ఇన్స్టాల్మెంట్ ను కూడా రైతుల ఖాతాలోకి జమ చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. వీటి ద్వారా ఆర్థికంగా వెనుకబడిన రైతుల కుటుంబాలకు ప్రభుత్వం ఆర్థిక భద్రతను కూడా కల్పిస్తోంది.

ఈ పథకంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం రైతులకు నాలుగు నెలలకు ఒకసారి ఏప్రిల్-జూలై, ఆగస్టు-నవంబర్, డిసెంబర్-మార్చ్ నెలల్లో 2000 రూపాయలు చొప్పున మొత్తం మూడు ఇన్స్టాల్మెంట్లుగా సంవత్సరానికి 6000 రూపాయలను రైతుల బ్యాంక్ అకౌంట్‌లోకి జమ చేస్తుంది. ఈ ఇన్స్టాల్మెంట్ల లో భాగంగా రైతులు ఆర్థిక సహాయాన్ని పొందాలంటే తప్పకుండా కేవైసీ, ల్యాండ్ డేటా సీడింగ్, ఆధార్ బ్యాంక్ అకౌంట్ లింక్ పూర్తి చేయాల్సిన అవసరం ఉందని ప్రభుత్వం తెలియజేసింది. వీటిని పూర్తి చేయని రైతులు ఇన్స్టాల్మెంట్‌ ను పొందలేరని ప్రభుత్వం ప్రకటించింది.

Read more RELATED
Recommended to you

Latest news