రైతు భరోసా డబ్బులు పడని రైతులకు అలర్ట్.. రైతు భరోసా డబ్బులు పడని రైతుల విషయంలో తెలంగాణ సర్కార్ కీలక ప్రకటన చేసింది. మిగిలిన రైతులకు మరో 9 రోజుల్లో వేస్తామని తుమ్మల నాగేశ్వర రావు వెల్లడించారు. అందరికి వేస్తామన్నారు.

రైతు భరోసా డబ్బులు నిన్న రాత్రి నుంచి జమ అవుతున్నాయి. 10 ఎకరాల వరకు ఈ నిధులను నేరుగా రైతుల ఖాతాలో ప్రభుత్వం జమ చేస్తోంది తెలంగాణ సర్కార్. ఖరీఫ్, రబీ సీజన్లకు కలిపి ఎకరానికి రూ.12 వేలు చొప్పున.. ఒక్కో సీజన్కు రూ. 6వేలు జమ చేస్తూన్నారు.
చిన్న, సన్నకారు రైతులకు పెట్టుబడి భారం తగ్గించేందు కు కాంగ్రెస్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. నిన్న రెండు ఎకరాల లోపు రైతులకు డబ్బులు జమ చేశారు. నిన్న రెండు ఎకరాల లోపు ఉన్న 41,25,289 మంది రైతుల ఖాతాల్లో రూ 2349.83 కోట్ల రైతు భరోసా నిధులు జమ చేసింది తెలంగాణ ప్రభుత్వం.