విశాఖలో యోగా డే వేడుకలకు భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. యోగా డే ను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఏపీ ప్రభుత్వం.. యోగా డే వేడుకలకు భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. విశాఖలోనే మంత్రుల బృందం ఉంది.. ఆర్కే బీచ్ రోడ్లో ప్రధాన వేదిక నిర్మాణం చేయనున్నారు. ఈ రోజు సాయంత్రం విశాఖపట్నానికి లోకేష్ రానున్నారు.. రేపు మధ్యాహ్నం సీఎం చంద్రబాబు నాయుడు వస్తారు.

ఏయూలో ప్రత్యామ్నాయ వేదిక ఏర్పాటు చేశారు. 25 వేల మంది గిరిజన విద్యార్థులతో సూర్య నమస్కారాలు చేయనున్నారు. విశాఖ తీరంలో 20, 21 తేదీల్లో చేపల వేటపై ఆంక్షలు ఉంటాయి. ప్రధాని మోదీ పర్యటన నేపథ్యంలో భద్రత కట్టుదిట్టం చేస్తున్నారు.
అటు విశాఖలో భారీ ట్రాఫిక్ జామ్ చోటు చేసుకుంది. యోగాంధ్ర కార్యక్రమానికి భారీగా ఏర్పాట్లు చేస్తున్న తరుణంలో.. కిలోమీటర్ల మేర బారులు తీరాయి వాహనాలు. భారీ ట్రాఫిక్ జామ్తో ఇబ్బందులు పడుతున్నామంటున్నారు వాహనదారులు.. ట్రాఫిక్ మెయింటెనెన్స్ కారణంగా రెండు రోజుల పాటు స్కూల్స్కు సెలవులు ప్రకటించింది ప్రభుత్వం.