ప్రధాని నరేంద్ర మోడీ యోగాసనాలు వేశారు. ఇవాళ అంతర్జాతీయ యోగా దినోత్సవం నేపథ్యంలో విశాఖపట్నంలో ప్రధాని నరేంద్ర మోడీ పర్యటించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా యోగా దుస్తులు ధరించిన ప్రధాని మోడీ.. యోగా చేశారు.

ప్రధాని నరేంద్ర మోడీతో పాటు సీఎం చంద్రబాబు నాయుడు అలాగే ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా యోగా సాధన చేస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.
ఈ సందర్బంగా మోడీ మాట్లాడారు. అంతరిక్షంలో కూడా యోగా చేసిన ఘనత మనదే అన్నారు ప్రధాని మోదీ. ప్రపంచ వ్యాప్తంగా ప్రజల జీవన శైలిని యోగా మార్చేసింది… యోగా విశ్వవ్యాప్తం కావడం సామాన్యమైన విషయం కాదని పేర్కొన్నారు. 175 దేశాలు యోగాను అనుసరిస్తున్నాయి… యోగా ప్రపంచాన్ని ఏకం చేసిందని పేర్కొన్నారు ప్రధాని మోదీ.
ప్రధాని మోదీతో కలిసి యోగా సాధన చేస్తున్న సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ pic.twitter.com/VnIzLxe5RK
— BIG TV Breaking News (@bigtvtelugu) June 21, 2025