తెలంగాణ మాజీ మంత్రి హరీష్ రావు సభలో కలకలం నెలకొంది. హరీష్ రావు సభలో అల్లు అర్జున్ పుష్ప సినిమా డైలాగ్తో ప్లకార్డులు ప్రదర్శించారు. పటాన్చెరులో నిర్వహించిన రైతు ధర్నాలో “2028 లో రప్పా రప్పా 3.0 లోడింగ్” అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు బీఆర్ఎస్ కార్యకర్తలు.

ఇది ఇలా ఉండగా ఏపీలో కూడా ఇదే పుష్ప డైలాగ్ పై రాజకీయాలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇలాంటి ప్లకార్డులు ప్రదర్శించినందుకే రవితేజ అనే యువకుడి పై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు ఏపీ పోలీసులు. అతనికి 14 రోజుల రిమాండ్ కూడా విధించింది కోర్టు. ఇక ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కూడా పుష్ప డైలాగ్ తో ప్లకార్డుల ప్రదర్శన జరుగుతున్నాయి. దీనిపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.
హరీష్ రావు సభలో అల్లు అర్జున్ పుష్ప సినిమా డైలాగ్తో ప్లకార్డులు
పటాన్చెరులో నిర్వహించిన రైతు ధర్నాలో "2028 లో రప్పా రప్పా 3.0 లోడింగ్" అంటూ ప్లకార్డులు ప్రదర్శించిన బీఆర్ఎస్ కార్యకర్తలు pic.twitter.com/G9U6nagInk
— Telugu Scribe (@TeluguScribe) June 21, 2025