వైఎస్ షర్మిల హాట్ కామెంట్స్ చేశారు. స్వార్థ రాజకీయాలకు జగన్ నెంబర్ వన్ అని ఫైర్ అయ్యారు వైఎస్ షర్మిల. సూపర్ సిక్స్.. సూపర్ ఫ్లాప్ అయిందని మండిపడ్డారు. 43 లక్షల మంది రైతులకు అన్యాయం చేయాలని చూస్తున్నారన్నారు వైఎస్ షర్మిల.
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో బాబు, జగన్, పవన్ బీజేపీకి తొత్తులేనని వెల్లడించారు. బీజేపీకి వ్యతిరేకంగా దత్తపుత్రుడు జగన్ ఒక్క ఉద్యమం కూడా చేయడన్నారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బలపడాల్సిన అవసరం ఎంతైనా ఉందని పేర్కొన్నారు ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల.