2026 మార్చి 30 లోపు నక్సలిజం లేకుండా చేస్తాం: అమిత్ షా

-

Amit shah:  2026 మార్చి 30 లోపు నక్సలిజం లేకుండా చేస్తామని హెచ్చరించారు అమిత్ షా. ఆయుధాలు వదిలి లొంగిపోతేనే మావోయిస్టులతో చర్చలు అన్నారు. తెలంగాణ రాష్ట్రం నిజామాబాద్ జిల్లాలో ఏర్పాటు చేసిన పసుపు బోర్డు కార్యాలయాన్ని ప్రారంభించారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా చేతులమీదుగా పసుపు బోర్డు కార్యాలయాన్ని ప్రారంభించారు. పసుపు బోర్డు కార్యాలయం లో ప్రదర్శనకు ఉంచిన పసుపు ఉత్పత్తులను కేంద్ర హోం మంత్రి అమిత్ షా పరిశీలించారు.

amit shah
amit shah

అనంతరం మాట్లాడుతూ…. పహల్గామ్ ఉగ్రదాడితో పాకిస్తాన్ భయపెట్టాలని చూసింది… ఆపరేషన్ సిందూర్ తో భారత్ శక్తి ఏమిటో పాకిస్తాన్ కు, ప్రపంచానికి తెలిసిందని పేర్కొన్నారు. ఉగ్రవాదాన్ని మాత్రమే కాదు.. దేశంలోని నక్సలిజాన్ని కూడా అంతం చేయాలన్నదే మోదీ ప్రభుత్వ లక్ష్యం అన్నారు అమిత్ షా. పసుపు రైతులకు ప్రధాని మోదీ ఇచ్చిన హామీ నెరవేరిందన్నారు. నిజామాబాద్ లో పసుపు బోర్డును ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. దేశంలోని పసుపు రైతులందరికీ అభినందనలు చెప్పారు అమిత్ షా.

Read more RELATED
Recommended to you

Latest news