తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రెండు రోజులపాటు కాలేజీలు బంద్ కానున్నాయి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జూలై 3, 4 తేదీలలో ఇంజనీరింగ్, డిగ్రీ కాలేజీల బంద్ కు PDSU పిలుపునిచ్చింది. విద్యారంగంపై ప్రభుత్వం వహిస్తున్న నిర్లక్ష్యం, రూ. 8 వేలకోట్ల రీయింబర్స్మెంట్, స్కాలర్ షిప్ బకాయిలను చెల్లించాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

విద్యార్థుల సంక్షేమాన్ని ప్రభుత్వం గాలికి వదిలేసిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విద్యారంగంపై ప్రభుత్వం తీరును నిరసిస్తూ ఈ బంద్ చేపడుతున్నట్టుగా తెలిపారు. వెంటనే బకాయిలు చెల్లించి, విద్యార్థులను ఆదుకోవాలని విద్యార్థి సంఘాలు కోరుతున్నాయి. దీనిపై కాంగ్రెస్ ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.