ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా.. వైజాగ్ లీడర్ పీవీఎన్ మాధవ్ పేరు ఖరారు ఐంది. బీజేపీ తెలుగు రాష్ట్రాల అధ్యక్షులుగా మాజీ ఎమ్మెల్సీ రామచందర్ రావు, మాజీ ఎమ్మెల్సీ PVN మాధవ్ పేర్లు ఖరారు అయ్యాయి. ఈ మేరకు సోమవారం ఉదయం హైకమాండ్ నుంచి ఇరువురికి ఫోన్ వచ్చినట్టు తెలుస్తోంది.

మధ్యాహ్నం రెండు గంటలకు వారు నామినేషన్ దాఖలు చేయనున్నారు. అధ్యక్ష ఎన్నికకు పోటీ ఉండకూడదనే ఉద్దేశంతో బీజేపీ హైకమాండ్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. జూలై 1వ తేదీన అధ్యక్ష ఎన్నిక ఉండనుంది.