pension: ఏపీ వాసులకు షాక్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొంతమందికి పెన్షన్లు కట్ చేస్తూ షాక్ ఇచ్చింది చంద్రబాబు నాయుడు ప్రభుత్వం. దివ్యాంగుల పెన్షన్లలో అక్రమాలపై చంద్రబాబు నాయుడు ప్రభుత్వం సీరియస్ గా దృష్టి పెట్టింది. గత ప్రభుత్వ హయాంలో అనర్హులు, అక్రమంగా సర్టిఫికెట్లు పొందినట్టుగా ఏపీ ప్రభుత్వం గుర్తించింది. ఇప్పటివరకు గుర్తించిన వారిలో లక్ష మందిని అనర్హులుగా గుర్తించి పింఛను నిలిపివేయాలని ప్రభుత్వం సూచనలు జారీ చేసింది.

దళారులు వైద్యులు, కుమ్మక్కై ఒక్కో సర్టిఫికేట్ కు రూ. 20 వేల నుంచి రూ. 30 వేల వరకు డబ్బులు వసూలు చేశారని అనేక రకాల ఆరోపణలు వస్తున్నాయి. ఇప్పటివరకు పరీక్షలకు హాజరు కాని వారిలోనూ కొంతమంది అనర్హులు అయ్యారు. త్వరలోనే ఈ విషయం పైన చంద్రబాబునాయుడు ప్రభుత్వం మరింత క్లారిటీ ఇవ్వనుంది. దీంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు షాక్ కి గురయ్యారు.