తెలంగాణ రాష్ట్రంలో మరో ఘోర ప్రమాదం జరిగింది. రెండు లారీలు ఒకదానికొకటి ఢీ కొట్టుకోవడంతో ఏకంగా ముగ్గురు అక్కడికక్కడే మరణించారు. ఈ సంఘటన ఖమ్మం, వరంగల్ హైవేపై ఇవాళ ఉదయం చోటుచేసుకుంది.

ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. ఖమ్మం అలాగే వరంగల్ హైవేపై శుక్రవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మరిపెడు శివారు కుడియాంతండా దగ్గర రెండు లారీలు ఒకదానికొకటి ఢీ కొట్టుకున్నాయి.
ఈ నేపథ్యంలో లారీ క్యాబిన్లో ఒక్కసారిగా మంటలు జరిగాయి. దీంతో లారీల డ్రైవర్లు అలాగే క్లీనర్ మృతి చెందాడు. మరొకరి పరిస్థితి విషమంగా ఉందని చెబుతున్నారు. దీంతో అతనికి.. ఆస్పత్రిలో వైద్యం అందిస్తున్నారు. ఈ సంఘటనపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.
ఘోర ప్రమాదం.. ముగ్గురు మృతి!
ఖమ్మం-వరంగల్ హైవేపై శుక్రవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదం
మరిపెడు శివారు కుడియాతండా వద్ద ఢీకొన్న రెండు లారీలు
లారీ క్యాబిన్లో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో లారీల డ్రైవర్లు, క్లీనర్ మృతి
మరొకరి పరిస్థితి విషమంగా ఉండడంతో స్థానిక ఆస్పత్రికి తరలింపు pic.twitter.com/oirmfI6GMT
— BIG TV Breaking News (@bigtvtelugu) July 4, 2025