ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తీవ్ర విషాదం నెలకొంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తాజాగా ఓ ప్రేమ జంట ఆత్మహత్య చేసుకుంది. ప్రకాశంలోని కొమరోలు మండలం అక్కపల్లి లో ఈ సంఘటన జరిగింది. పెద్దలు తమ వివాహానికి నిరాకరించడంతో ప్రేమజంట ఆత్మహత్య చేసుకుందని సమాచారం అందుతుంది.

పండుగ పూట ఇవాళ తెల్లవారి జామున యువతి అలాగే యువకుడు ఇద్దరు కూడా చెట్టుకు వేలాడుతూ కనిపించారు. మృతులు నంద్యాల ప్యాపిలి మాధవరం వాసులుగా.. గుర్తించారు. ఇక ఈ సంఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగారు. దీనిపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఈ సంఘటనపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.