ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్నదాతలకు గుడ్ న్యూస్. ఈ మేరకు సుఖీభవ పథకానికి సంబంధించి కీలక అప్డేట్ వచ్చింది. ఇవాళ దర్శి మండలంలో ‘అన్నదాత సుఖీభవ’ పథకాన్ని ప్రారంభించనున్నారు సీఎం చంద్రబాబు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 46.85 లక్షల మంది రైతులకు తొలి విడతగా ఒక్కో రైతుకు ₹5,000 చొప్పున ₹2,342.92 కోట్ల నిధులు జమ కానున్నాయి.

కేంద్రం రూ.2,000 సాయం కలిపి మొత్తం ₹7,000 లబ్దిదారుల ఖాతాల్లోకి వస్తుంది. రైతులకు ముందుగానే సమాచారం అందించేందుకు ‘మనమిత్ర’ ద్వారా సందేశాలు పంపనున్నారు. ఈ పథకంపై సందేహాలు ఏమైనా ఉంటే నివృత్తి చేసుకునేందుకు 155251 టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేసింది ఏపీ ప్రభుత్వం.