పాడి రైతులకు గుడ్ న్యూస్…ఇక పై 80% రాయితీ !

-

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పాడి రైతులకు ప్రభుత్వం శుభవార్త అందజేసింది. పశుగ్రాసం కోసం పాడి రైతులు 20 శాతం చెల్లిస్తే, ప్రభుత్వం 80% రాయితీ అందిస్తుందని ప్రభుత్వం పేర్కొంది. ఈ బీమా మూడు సంవత్సరాల పాటు ఉంటుందని ఆ సమయంలో పశువులు అకాల మరణం చెందితే రూ. 30,000 బీమా పొందవచ్చని ప్రభుత్వం స్పష్టం చేసింది. గొర్రెలు, మేకలు ప్రమాదవశాత్తు మరణించినట్లయితే రూ. 6,000 బీమా వస్తుందని పశుసంవర్ధక శాఖ పేర్కొంది.

The government has given good news to dairy farmers in the state of Andhra Pradesh
The government has given good news to dairy farmers in the state of Andhra Pradesh

కాగా, ఇప్పటికే పశువులకు 50% రాయితీతో దాణ అందిస్తున్నారు. దీంతో పాడి రైతులు పశువులను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపిస్తారని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో ఏపీలోని పాడి రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏపీని అభివృద్ధి చేసే దిశగా అనేక రకాల పథకాలను అమలులోకి తీసుకువస్తున్నారు. ఇప్పుడు పశువుల కోసం తీసుకున్న ఈ నిర్ణయంతో ఏపీ ప్రజలు చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి కృతజ్ఞతలు చెబుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news