బిగ్ బ్రేకింగ్; ఒక్క రోజే ఏపీలో 80 కరోనా పాజిటివ్ కేసులు…!

-

ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ కేసులు ఒక్క రోజే భారీగా నమోదు అయ్యాయి. గత 24 గంటల్లో 80 కేసులు నమోదు అయినట్టు అధికారులు గుర్తించారు. దీనితో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 893 చేరుకుంది. ఒక్క కర్నూలు జిల్లాలోనే 30 కేసులు నమోదు అయ్యాయి. ఏపీ లో ప్రస్తుతం 725 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. కర్నూలు జిల్లాలో అత్యధికంగా 234 కేసులు నమోదు అయ్యాయి.

ఏపీలో ఇప్పటి వరకు 27 మంది మరణించారు. గుంటూరు 18 కొత్త కేసులు నమోదు కాగా చిత్తూరు 14 కేసులు, అనంతపురం ఆరు, తూర్పు గోదావరి 6 కేసులు నమోదు అయ్యాయి. ప్రకాశం రెండు విశాఖ జిల్లాలో ఒక్క కేసులు నమోదు అయింది. కృష్ణా జిల్లాలో 2 కేసులు నమోదు అయ్యాయి. కోలుకున్న వారి సంఖ్య 141 గా ఉంది. గుంటూరు జిల్లాలో 195 కేసులు నమోదు అయ్యాయి. కృష్ణా జిల్లాలో 88 కేసులు ఉన్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news