ఇద్దరు అగ్ర నటులకు వీడ్కోలు లేకుండా చేసిన కరోనా…!

-

రిషీ కపూర్, ఇర్ఫాన్ ఖాన్… బాలీవుడ్ లో ఇద్దరూ అగ్ర నటులే. ఇండియన్ సినిమాలో తమకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న నటులే. లక్షలాది మంది అభిమానులను సంపాదించుకున్నారు. రిషీ కపూర్ ఇండియా కు మాత్రమే పరిమితం కాగా ఇర్ఫాన్ ఖాన్ ఇండియన్ సినిమాకే కాదు హాలీవుడ్ కి కూడా సుప్రసిద్ధ నటులు. ఆయన అక్కడ ఎన్నో విజయవంతమైన సినిమాల్లో నటించి తనదైన ముద్ర వేసారు.

ఇద్దరూ కూడా 24 గంటల వ్యవధిలోనే కన్ను మూశారు. ఇద్దరూ కూడా క్యాన్సర్ తోనే మరణించారు. కాని ఇద్దరూ చివర్లో మాత్రం ఘనమైన వీడ్కోలు మాత్రం అందుకోలేకపోయారు. ఇద్దరు లెజెండ్స్ ని చాలా సాదా సీదాగా సాగనంపారు. లెజెండ్ ఎవరు అయినా మరణిస్తే దేశ వ్యాప్తంగా ఉన్న వారి అభిమానులు హాజరవుతూ ఉంటారు. ముంబై లో అత్యంత ఘనంగా అంత్య క్రియలు జరుగుతూ ఉంటాయి.

ఇర్ఫాన్ మరణించిన కాసేపటికే అంటే మూడు గంటల లోపే అంత్యక్రియలను పూర్తి చేసారు. అభిమానులు ఎవరూ రాలేకపోవడమే కాకుండా ఘన నివాళి అర్పించడానికి ఎవరూ లేరు. దీనితో ఇద్దరు నటులకుచాలా సాదా సీదాగా అంత్యక్రియలు ముగిసాయి. దీనిపై బాలీవుడ్ ప్రముఖులు కూడా ఆవేదన వ్యక్తం చేసారు. ఇద్దరినీ కరోనా ఒంటరి చేసిందని పలువురు బాలీవుడ్ నటులు కామెంట్స్ చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news