ఈరోస్ తో సుకుమార్ బిగ్ డీల్..!

-

Sukumar Big Deal with Eros International

క్రియేటివ్ డైరక్టర్ సుకుమార్ రంగస్థలం హిట్ తో తన సత్తా ఏంటో చూపించాడు. ఆర్య తర్వాత సుకుమార్ రేంజ్ తెలిపిన హిట్టు కొట్టిన సినిమా రంగస్థలం మాత్రమే. ఆ సినిమా తర్వాత సూపర్ స్టార్ మహేష్ తో సినిమాకు సిద్ధమవుతున్నాడు సుక్కు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా వెనుక నడిపించేది ఈరోస్ ఇంటర్నేషనల్ వారని తెలుస్తుంది.

మహేష్, సుకుమార్ కలిసి చేసిన 1 నేనొక్కడినే సినిమా 14 రీల్స్ బ్యానర్ లో నిర్మించగా ఆ సినిమా రిలీజ్ కు ముందే ఈరోస్ సంస్థ కొనేసింది. అయితే సినిమా రిజల్ట్ ప్రకారం ఈరోస్ వారికి ఓ సినిమా చేసేలా అగ్రిమెంట్ చేసుకున్నారట మహేష్, సుకుమార్. అందుకే సుకుమార్ ఈ సినిమా పేరుకి మైత్రి బ్యానర్ అని చెబుతున్నా అసలు నిర్మాతలు ఈరోస్ వారే అని తెలుస్తుంది.

అంతేకాదు ఈ సినిమాకు బాహుబలి రైటర్ విజయేంద్ర ప్రసాద్ కథ అందిస్తాడని టాక్. సుకుమార్ చెప్పిన కథ మహేష్ కు నచ్చలేదట అందుకే ఈరోస్ వారి ప్రమేయంతో విజయేంద్ర ప్రసాద్ కథను మహేష్ తో చేసేలా సుకుమార్ ను ఒప్పించారట. ఈ సినిమా కోసం సుకుమార్ భారీ డీల్ సెట్ చేసుకున్నాడట. మరి రంగస్థలం తర్వాత మహేష్ తో చేస్తున్న ఈ మూవీ ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news